Srimad Valmiki Ramayanam
Balakanda Sarga 72
The Four marriages !!
||om tat sat ||
బాలకాండ
ద్విసప్తతితమస్సర్గః
( శ్రీరామ లక్ష్మణ భరత శతృఘ్నలకు సీత ఊర్మిళా మాండవీ శ్రుతకీర్తులను ఇచ్చి వివాహమొనర్చుటకు నిశ్చయించుట)
తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః |
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్ ||
స||ఉక్తవంతం వైదేహం వసిష్ఠసహితం నృపం తం వీరం వచనం మహామునిః విశ్వామిత్రః ఉవాచ ||
తా|| అట్లు వీరుడైన విదేహమహరాజు చే చెప్పబడిన వసిష్టునితో కూడిన మహాముని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.
అచింత్యాన్యప్రమేయాని కులాని నరపుంగవ |
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోs స్తి కశ్చన ||
స|| హే నరపుంగవ ఇక్ష్వాకూణాం విదేహానాం కులాని అచిన్త్యాని అప్రమేయాని | ఏషాం కశ్చన న తుల్యః అస్తి |
తా|| "ఓ నరపుంగవా ! ఇక్ష్వాకు విదేహ కులములు సాటిలేనివి వాటి వైభవము వర్ణింపబడలేనివి. వీటితో సమానమైనవి లేవు".
సదృశో ధర్మసంబంధః సదృశో రూపసంపదా |
రామలక్ష్మణయో రాజన్ సీతాచోర్మిళయా సహ ||
స|| రాజన్! రామలక్ష్మణయోః సీతా చ ఉర్మిళా సహ సంబంధః ధర్మ సదృశః రూపసంపదా సదృశః ||
తా|| "ఓ రాజా! సీతా ఊర్మిళలతో రామ లక్ష్మణుల సంబంధము ధర్మరీత్యా సదృశము. రూపసంపదలలో కూడా సదృశము".
వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ |
భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః ||
స|| హే నరశ్రేష్ఠ ! మమ వచనం వక్తవ్యం శ్రూయతాం | ఏష రాజా భ్రాతా కుశధ్వజః యవీయాన్ ధర్మజ్ఞః ||
తా|| "ఓ నరశ్రేష్ఠా ! చెప్పతగిన నా వచనములను వినురుగాక | ఈ తమ్ముడు అగు రాజు కుశధ్వజుడు అతి ధర్మజ్ఞుడు".
అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణా ప్రతిమం భువి |
సుతా ద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే ||
భరతస్య కుమారస్య శతృఘ్నస్య చ ధీమతః |
వరయామ స్సుతే రాజన్ తయోరర్థే మహాత్మనోః ||
స|| హే నరశ్రేష్ఠ ! రాజన్ ధర్మాత్మనః అస్య సుతా ద్వయం రూపేణ భువి అప్రతిమం ధీమతః భరతస్య శతృఘ్నస్య కుమారస్య పత్న్యర్థం వరయామహే || హే రాజన్ తయోః సుతే మహాత్మనయోః అర్థే వరయామః ||
తా|| "ఓ రాజా! ఈ ధర్మాత్ముడగు రాజుకి గల భువిలో అతి సందరమైన ఇద్దరు కుమార్తెలను ఓ నరశ్రేష్ఠా ధీమతులైన కుమారులు భరత శతృఘ్నుల భార్యలు అగుటకు ప్రార్థించుఉన్నాను. ఓ రాజా! నీ పుత్రికలను ఈ మహాత్ముల కోసము కోరుచున్నాను"
పుత్త్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః |
లోకపాలోపమాస్సర్వే దేవతుల్య పరాక్రమః ||
స|| దశరథస్య ఇమే పుత్త్రాః రూపయౌవ్వనశాలినః | సర్వే లోకపాల ఉపమా:| దేవతుల్య పరాక్రమాః ||
తా|| "దశరథుని ఈ పుత్రులు రూపయౌవ్వన సంపదలు కలవారు. లోకపాలునితో సరితూగువారు.దేవులతో సమానమైన పరాక్రమము కలవారు".
ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతామ్ |
ఇక్ష్వాకోకులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః ||
స|| హే రాజేంద్ర ! సంబంధేన ఇక్ష్వాకుకులం భవతః ఉభయోః అపి పుణ్యకర్మణః అనుభధ్యతాం ||
తా|| "ఓ రాజేంద్ర ! ఈ సంబంధముతో పుణ్యకార్యములు చేసిన ఇక్ష్వాకుకులము మీది కూడా దృఢపడును".
విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తథా |
జనకః ప్రాంజలి ర్వాక్యం ఉవాచ మునిపుంగవౌ ||
స|| వసిష్ఠస్య మతే విశ్వామిత్ర వచః శ్రుత్వా జనకః మునిపుంగవౌ ప్రాంజలిః వాక్యం ఉవాచ ||
తా|| వసిష్ఠుని సమ్మతితో చెప్పబడిన విశ్వామిత్రుని వచనములను విని జనకుడు ఆ మునిపుంగవులకు అంజలిఘటించి ఇట్లు పలికెను.
కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ |
సదృశం కులసంభంధం యదాజ్ఞాపయథః స్వయమ్ ||
స|| హే మునిపుంగవౌ ! యదా స్వయం ఆజ్ఞాపయథః యేషాం కులసంబంధం సదృశం మన్యే | ఇదం కులం ధన్యం ||
తా|| "ఓ మునిపుంగవులారా ! మీరు స్వయముగా అజ్ఞాపించుటవలన ఈ కులసంబంధము తగినది అని భావిస్తున్నాను. ంఆ కులము ధన్యమైనది".
ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే |
పత్న్యౌ భజేతాం సహితౌ శతృఘ్నభరతావుభౌ ||
స|| భద్రం వః ||కుశధ్వజ సుతే ఇమే శతృఘ్నభరతా వుభౌ పత్న్యౌ సహితౌ భజేతాం | ఏవం భవతు ||
తా|| "మీకు శుభము అగుగాక. కుశధ్వజుని పుత్రికలు ఇద్దరూ భరత సతృఘ్నులకు పత్నులు అగుదురు గాక".
ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే |
పాణీన్ గృహ్ణంతు చత్వారో రాజపుత్త్రా మహాబలాః ||
స|| రాజపుత్రీణాం చతసౄణాం చత్వారో రాజపుత్త్రాః ఏకాహ్న పాణీన్ గృహ్ణంతు ||
తా|| నలుగురు రాజపుత్రుల నలుగురు రాజపుత్రికల పాణిగ్రహణము ఒకేదినమున అగుగాక |
ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః|
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః ||
స|| బ్రహ్మన్ ! మనీషిణః ఉత్తర ఫల్గుణీభ్యాం యత్ర ప్రజాపతిః భగః (అస్తి తత్ దినే ) వైవాహికం ప్రశంసంతి |
తా|| "ఓ బ్రహ్మన్ !మనుష్యులు భగ ప్రజాపతి ఉత్తర ఫలుగుణి లో ఉన్నప్పుడు జరుగు వివాహము ప్రశంసించుదురు".
ఏవముక్త్వా వచసౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః |
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్ ||
స|| సౌమ్యం వచః ఏవం ఉక్త్వా కృతాంజలిః ఉభౌ మునివరౌ ప్రతి ఉద్ధాయ జనకః వాక్యమ అబ్రవీత్ ||
తా||సౌమ్యమైన ఇట్టి వచనములను ఆ మునులు ఇద్దరులతో పలికి , జనకుడు కృతాంజలి ఘటించి మరల ఇట్లు పలికెను .
పరో ధర్మః కృతో మహ్యం శిష్యో sస్మి భవతోః సదా |
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ ||
స|| హే మునిపుంగవౌ ! మహ్యం పరోధర్మః కృతః | సదా భవతోః శిష్యో అస్మి | ఇమాం ముఖ్యాని ఆసనాని ఆసతాం ||
తా|| "ఓ మునిపుంగవులారా ! నాకు ఉపకారము చేసితిరి. ఎల్లప్పుడూ మీకు శిష్యుడుగానుందును. ఈ ముఖ్యమైన ఆసనములను స్వీకరించుడు".
యథా దశరథస్యేయం తథాయోధ్యాపురీమమ |
ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హథ ||
స|| యథా దశరథస్య అయోధ్యాపురీ తథా ఇయం| మమ ప్రభుత్వే సందేహం న అస్తి | యథార్హం కర్తుమర్హథ ||
తా|| "ఈ ( మిథిలా) నగరమును దశరథుని అయోధ్యాపురి వలె నే అని భావించుడు. నా ప్రభుత్వములో సందేహము లేదు. మీరు ఆజ్ఞాపించినటులనే అగును".
తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః |
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్ ||
స|| తథా వైదేహే బ్రువతి రఘునందనః రాజా దశరథః హృష్ఠః మహీపతిం జనకే ప్రత్యువాచ||
తా|| అట్లు చెప్పిన విదేహరాజుకి రఘునందనుడగు రాజు దశరథుడు సంతోషముతో జనక మహారాజు కి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
యువామసంఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ |
ఋషయో రాజసంఘాశ్చ భవద్బ్యామభిపూజితాః ||
స|| భ్రాతరౌ మిథిలేశ్వరౌ యువాం అసంఖ్యేయ గుణౌ ( అస్తి) | ఋషయోః రాజసంఘాశ్చ భవద్భాం అభిపూజితః ||
తా|| "ఓ మిథిలేశ్వరులరా ! మీకు అసంఖ్యాకమైన గుణములు కలవు. ఋషులు రాజుసంఘములు మీ చేత పూజింపబడినవి".
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయం |
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్ ||
స|| స్వస్తి ప్రాప్నుహి ! స్వమాలయం గమిష్యామి | శ్రాద్ధకర్మాణి సర్వాణి విధస్యాం | భద్రం తే | ఇతి అబ్రవీత్ చ ||
తా|| "మీకు శుభమగుగాక ! నా భవనమునకు వేళ్ళెదను. శ్రాద్గకర్మలను అన్నింటినీ చేసెదను. మీకు శుభమగుగాక" . అని చెప్పెను
తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా |
మునీంద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహయశాః ||
స|| తదా రాజా దశరథః తం నరపతిం అపృష్ట్వా మహాయశాః తౌ మునీంద్రౌ పురస్కృత్య జగామాశు ||
తా||అప్పుడు రాజా దశరథుడు ఆనరపతి అనుమతితో ఆ మునీంద్రులిద్దరితో కలిసి వెళ్ళెను.
స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః |
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్ ||
స|| స నిలయం గత్వా విధానతః శ్రాద్ధం కృత్వా ప్రభాతే కాల్యం ఉత్థాయ ఉత్తమమ్ గోదానం చక్రే||
తా|| అతడు తన ఆలయమునకు పోయి విథి విధానముగా శ్రాద్ధకర్మలను నిర్వహించి ప్రభాత సమయములో ఉత్తమమైన గోవుల దానము చేసెను.
గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః |
ఏకైకశో దదౌ రాజా పుత్త్రానుద్దిశ్య ధర్మతః ||
స|| ఏకైకశో పుత్త్రాన్ ఉద్దిశ్య ధర్మతః శతశహస్రాణి గవాం బ్రాహ్మణ్యేభ్యో దదౌ ||
తా|| ప్రతి ఒక్కరి పుత్త్రులకోసము ధర్మానుసారముగా లక్ష గోవులను బ్రాహ్మణునకు దానమిచ్చెను.
సువర్ణ శృంగా స్సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః |
గవాం శతసహసాణి చత్వారి పురుషర్షభ ||
స|| సువర్ణశృంగ సంపన్నాః సవత్సాః కాంస్య దోహనాః చత్వారి శతసహస్రాణి గవాం ( బ్రాహ్మణ్యేభ్యో దదౌ)
తా|| (అవి) బంగారపు కొమ్ములు గలవి ,పాలు సమృద్ధిగా ఇచ్చునవి, దూడలు ఉన్నవి. అట్టి నాలుగు లక్షల ఆవులను బ్రాహ్మణులకు ఇచ్చెను.
విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునందనః |
దదౌ గోదానముద్దిశ్య పుత్త్రాణాం పుత్త్రవత్సలః ||
స|| పుత్రవత్సలః రఘునందనః పుత్రాణామ్ గోదానముద్దిస్య అన్యచ్చ సుబహు విత్తం ద్విజేభ్యో దదౌ ||
తా|| పుత్రవత్సలుడగు రఘునందనుడు పుత్త్రులక్షేమముకోరఅకు గో దానము ఇచ్చి ఇంకా చాలా ధనమును బ్రాహ్మణులకు ఇచ్చెను.
స సుతైః కృతగోదానైః వృతస్తు నృపతిస్తదా |
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతిః ||
స|| స నృపతిః తదా కృత గోదానైః లోకపాలైః వృతః వృతస్తు సౌమ్యః ప్రజాపతిః ఇవ భాతి ||
తా|| గోదానములను ఇచ్చిన ఆ ( దశరథ) మహారాజు లోకపాలులచే చుట్టబడిన సౌమ్యుడగు ప్రజాపతి వలె ప్రకాశించుచుండెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విసప్తతితమస్సర్గః ||
సమాప్తం ||
|| ఈ విథముగా బాలకాండలోని దెబ్బది రెండవ సర్గ సమాప్తము||
|| ఓమ్ తత్ సత్ ||
||om tat sat ||