!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 272-273

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి 272-273 శ్లోకములు:

271 వ శ్లోకములో, లోకమును అనుసరించుట వదిలేసి, దేహమును అనుసరించుట వదిలేసి, కర్మ ఫలములు బోధించు శాస్త్రములను అనుసరించుట వదిలేసి; నీలో వున్న ఆజ్ఞానము అంటే, నేనే సర్వస్వము అనే అహంకార మమకారములను నాశనము చేయుము అని.

ఆత్మజ్ఞానము సంపాదించడములో వచ్చే అడ్డంకులు లోక ప్రవర్తన, దేహాభిమానము, యజ్ఞయాగాదులు. ఇవే సాధకుని ప్రయాణన్ని ఆపేవి.ందుకని వాటిమీద గురువు చెప్పే మాట,  వాటిని వదిలేసేయ్ అని. వదిలేసి లోపల వున్న వున్న ఆజ్ఞానము అంటే, నేనే సర్వస్వము అనే అహంకార మమకారములను నాశనము చేయుము అని అన్నాడు గురువు.

ఇక్కడ వదిలేసెయ్ అని చెప్పిన మూడు, ఎందుకు వదిలేయాలి అన్నది తార్కికముగా చెప్పి, శృతులు కూడా అదే మాట చెపుతాయి అని గురువు 272 273 శ్లోకాలలో చెప్పుతాడు.

శ్లోకము 272:

లోకవాసనతయా జన్తోః
శాస్త్రవాసనయా పి చ।
దేహవాసనయా జ్ఞానం
యథావత్ నైవజాయతే॥272॥

1 లోకవాసనతయా జన్తోః -
మానవులకు లోకవాసన తోనూ;

లోకవాసన అంటే అందరి మొప్పు పొందాలి అనే యాతన,

2 శాస్త్రవాసనయా పి చ-
శాస్త్ర వాసన చేతనూ కూడా;

ఫలములను కూర్చే కర్మానుష్ఠానమును ప్రోత్సహించే శాస్త్రములను అనుసరించాలి అన్న కోరికని శాస్త్రవాసన అని అంటారు.

3 దేహవాసనయా -
దేహవాసన చేతనూ;

దేహమే ఆత్మ అనుకోవడమే దేహవాసన, ఈ క్షణికమైన దేహాన్ని శాశ్వతము అనుకొని దానికై పదే యాతనలే దేహ వాసనలు.

4 యథావత్ జ్ఞానం నైవజాయతే -
యదార్థమైన జ్ఞానము కలుగదు.

ఈ మూడు వాసనలవలన యదార్థమైన జ్ఞానము కలుగదు.

272వ శ్లోక తాత్పర్యము:

మానవులకు లోకవాసన తోనూ, శాస్త్ర వాసన చేతనూ,  దేహవాసన చేతనూ,
యదార్థమైన జ్ఞానము కలుగదు.

అంటే గురువు 271 వ శ్లోకములో, ఆ మూడు వాసనలు ఎందుకు వదలమంటున్నాడో, దానిలి కారణము చెప్పేశాడు. ఆ మూడింటివలన యదార్థమైన జ్ఞానము కలుగదు. అందుకని ఆ మూడూ త్యజింప తగినవి.


శ్లోకము 273

సంసార కారాగృహమోక్షమ్ ఇచ్ఛోః
అయోమయం పాదనిబద్ధ శృంఖలమ్।
వదన్తి తద్ జ్ఞాః పటువాసనాత్రయమ్
యోఽస్మాత్ విముక్తః  సః ఉపైతి ముక్తిమ్॥273॥

1 సంసారకారాగృహమోక్షమ్ ఇచ్ఛోః-

సంసారమనబడు కారాగారమునుంచి బయటపడే మోక్షము కోరుకొను వారికి;
   
2 అయోమయం పాదనిబద్ధ శృంఖలమ్।
అయోమయము కలిగించే పాదములకు కట్టబడిన సంకెళ్ళు;

ఏమిటా సంకెళ్ళూ?

3 పటువాసనాత్రయమ్ -
కృశింపకుండా వున్న వాసనా త్రయము;

అంటే, సంసారమనబడు కారాగారమునుంచి బయటపడాలి అని మోక్షము కోరుకొను వారికి, కృశింపకుండా బలముగా వున్న వాసనా త్రయము అయోమయము కలిగించే పాదములకు కట్టబడిన సంకెళ్ళు. (అంటే మళ్ళీ అదే మాట. మోక్షము కోరుకొను వారు ఆ వాసనలను వదిలెయ్యాలి)

4 యోఽస్మాత్ విముక్తః  సః ఉపైతి ముక్తిమ్-
యః అస్మాత్ విముక్తః - ఎవరైతే వీటినుంచి విముక్తుడు అవుతాడో
సః ఉపైతి ముక్తిమ్ - వాడు ముక్తి పొందుతాడు

అంటే ఎవరైతే ఈ మూడు వాసనల నుంచి విముక్తుడు అవుతాడో వాడు ముక్తి పొందుతాడు అని;

వదన్తి తద్ జ్ఞాః -
అని బ్రహ్మ వేత్తలు చెప్పుచున్నారు.

అంటే ఎవరైతే ఈ మూడు వాసనల నుంచి విముక్తుడు అవుతాడో వాడు ముక్తి పొందుతాడు అని అని బ్రహ్మ వేత్తలు చెప్పుచున్నారు;


273 వ శ్లోకతాత్పర్యము:

సంసారమనబడు కారాగారమునుంచి బయటపడాలి అని మోక్షము కోరుకొను వారికి, కృశింపకుండా బలముగా వున్న వాసనా త్రయము అయోమయము కలిగించే పాదములకు కట్టబడిన సంకెళ్ళు. ఎవరైతే ఈ మూడు వాసనల నుంచి విముక్తుడు అవుతాడో వాడు ముక్తి పొందుతాడు అని అని బ్రహ్మ వేత్తలు చెప్పుచున్నారు;

॥ఓమ్ తత్ సత్॥

________________________________________________

గురువు తత్త్వజ్ఞానము అంటే "నీవే బ్రహ్మము" అన్న మాటని చాలా విశదముగా చెప్పాడు. అది అత్యంత సులభముగా అర్థము అయ్యేటట్లు చెప్పినా అది (practical గా) అంతర్గతము చెయ్యడము  సులభము కాదు.

ఇక్కడ గురువు practical గా వచ్చే సమస్యలు గురించి చెపుతూ,  268వ మొదటి శ్లోకములో  మోక్షము పొందే స్థితికి  పూర్వజన్మ వాసనలు నాశనము చెయ్యాలి అని, అవి నాశనము చెయ్యాలి అంటే ప్రతిబంధకము  నేను నాది అను ఏ భావము కలదో అదే ఆ ప్రతిబంధకము అని 269 వ శ్లోకములో చెప్పాడు. 

అయితే ప్రతిబంధకము సమూలముగా నశింపచేయడానికి మార్గము 270 / 271 శ్లోకములలో వస్తుంది.

శ్లోకము 270

జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం
బుద్ధి తత్ వృత్తి సాక్షిణమ్।
సోఽహమిత్యేవ సద్వృత్యా
అనాత్మన్యా ఆత్మమతిం జహి॥270॥

1 జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం-
తనను ప్రత్యగాత్మగా తెలిసికొని

తనను ప్రత్యగాత్మగా తెలిసికొని - ఆ ఆత్మ ఎలాంటిది అంటే అదే అన్నిటికి సాక్షి అని మనకు తెలుసు, అదే గురువు గుర్తుచేస్తాడు;

2 బుద్ధి తత్ వృత్తి సాక్షిణమ్-
బుద్ధి దాని  వృత్తులకు సాక్షియగు

అంటే గురువు చెప్పినమాట - తనను, బుద్ధి దాని  వృత్తులకు సాక్షియగు ప్రత్యగాత్మగా తెలిసికొని అని -  ఆత్మ తెలియగానే, వెంటనే జరిగే కార్యక్రమము అనాత్మని నాశనము చెయ్యడమే. అది ముందు శ్లోకపాదాలలో వస్తుంది.   

3 సోఽహమిత్యేవ సద్వృత్యా:
నేనే ఆ బ్రహ్మమును అనే జ్ఞానముచే;

4 అనాత్మన్యా ఆత్మమతిం జహి
అనాత్మలో నేనే ఆత్మను అనే బుద్ధిని నాశనము చేయుము;

నేనే ఆ బ్రహ్మమును అనే జ్ఞానముచే అనాత్మలో నేనే ఆత్మను అనే బుద్ధిని నాశనము చేయుము. అంటే ఆ అహంకారమును అణగద్రొక్కుము అని.

"జహి" అన్నమాటతో , కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట గుర్తు వస్తుంది - "జహి శతృం మహాబాహో కామరూపమ్ దురాసదమ్" - "ఓ అర్జునా, కోరిక రూపములతో కూడిన ఆ శత్రువుని నాశనము చెయ్యి" అని.
అదే మాట గురువు మనకి తనమాటలలో చెపుతాడు;

270వ శ్లోకతాత్పర్యము:

తనను బుద్ధి దాని  వృత్తులకు సాక్షియగు ప్రత్యగాత్మగా తెలిసికొని , నేనే ఆ బ్రహ్మమును అనే జ్ఞానముచే అనాత్మలో నేనే ఆత్మను అనే అహంకారమును  చేయుము అని - 

అంటే,  నేను నాది అను ఏ అహంకార భావము కలదో అదే ఆ ప్రతిబంధకము. ఆప్రతిబంధము తొలగించడానికి , తనే సాక్షి రూపమైన అసలు ఆత్మ అని గ్రహించి, అనాత్మలో నేనే ఆత్మను అనే అహంకారమును నాశనము చెయ్యాలి అన్నమాట. ఇది 270 వ శ్లోకములో చెప్పినమాట. 
  
అయితే అనాత్మలో వున్న నేనే ఆత్మను అనే అహంకారమును ఎలా నాశనము చెయ్యాలి అన్న ప్రశ్నకి, 271 వ శ్లోకములో మార్గము చెపుతాడు.

శ్లోకము 271

లోకానువర్తనం త్యక్త్వా
త్యక్త్వా దేహానువర్తనమ్।
శాస్త్రానువర్తనం త్యక్త్వా
స్వాధ్యాసాపనయం కురు॥271॥

లోకానువర్తనం త్యక్త్వా-
లోకమును అనుసరించుట వదిలేసి;

త్యక్త్వా దేహానువర్తనమ్ -
దేహమును అనుసరించుట వదిలేసి

శాస్త్రానువర్తనం త్యక్త్వా-
శాస్త్రములను అనుసరించుట వదిలేసి;

శాస్త్రములు అంటే ఫలపూరిత శాస్త్రవాక్కులను వదిలేసి - మన వేదాలలో చాలా యజ్ఞయాగాదులు వున్నాయి, అవన్నీ వదిలేయమని అర్థము; ఇదే మాట భగవద్గీతలో - "వేదవాతరతాః పార్థ, నాన్యదస్తీతి వాదినః", ఫల పూరిత వేదవాక్కులే నిజము అని వాదించేవారికి మోక్షము రాదు అని  కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ గురువు కర్మ సంబంధమైన శాస్త్రములని వదిలి వేయుము అని చెపుతున్నాడు అన్నమాట.

ఇవన్నీ వదిలేసి ఏమి చెయ్యాలి?

 స్వాధ్యాసాపనయం కురు-
నీలో వున్న ఆజ్ఞానము ను నాశనము చేయుము:

అంటే, నేనే సర్వస్వము అనే అహంకార మమకారములను నాశనము చేయుము అని.

271 వ శ్లోకతాత్పర్యము:

లోకమును అనుసరించుట వదిలేసి, దేహమును అనుసరించుట వదిలేసి,
కర్మ ఫలములు బోధించు శాస్త్రములను అనుసరించుట వదిలేసి; నీలో వున్న ఆజ్ఞానము అంటే, నేనే సర్వస్వము అనే అహంకార మమకారములను నాశనము చేయుము అని.

ఆత్మజ్ఞానము సంపాదించడములో వచ్చే అడ్డంకులు లోక ప్రవర్తన, దేహాభిమానము, యజ్ఞయాగాదులు. ఇవే సాధకునిని ఆపేవి. వాటిమీద గురువు చెప్పే మాట,  వాటిని వదిలేసేయ్ అని. వదిలేసి లోపల వున్న వున్న ఆజ్ఞానము అంటే, నేనే సర్వస్వము అనే అహంకార మమకారములను నాశనము చేయుము అని అన్నాడు గురువు.

ఇక్కడ వదిలేసెయ్ అని చెప్పిన మూడు ఎందుకు వదిలేయాలి అన్నది తార్కికముగా చెప్పి, శృతులు కూడా అదే మాట చెపుతాయి అని గురువు 272 273 శ్లోకాలలో చెప్పుతాడు.    

॥ఓమ్ తత్ సత్॥















































 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273

Om tat sat !

 

 

 

    •