||సుందరకాండ ||

||ఇరువది తొమ్మిదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 29 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ అష్టావింశస్సర్గః

ఈ సర్గ, ఆ వృక్షశాఖలలో వున్న పక్షి ఇది శోకమునకు తగిన సమయము కాదు అని సూచిస్తూ మళ్ళీ మళ్ళీ ఉత్తమము అయిన సాంత్వవచనములను పలుకుచున్నట్లు ఉంది అని విన్న నేపథ్యములో ఈ సర్గ మొదలవుతుంది. కాని సీతమ్మ మనస్సులో రావణుని బెదరింపులు రాక్షసస్త్రీల తర్జన భర్జనలే మెదలుతూ ఆమెను శోకసముద్రములోనుంచి బయటకు రావడానికి ఇంకా వుంటాయి.

ఇక ఇరువది ఎనిమిదవ సర్గలో కవి చెప్పిన శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.

||శ్లోకము 28.01||

సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య
తద్రావణ స్యా ప్రియ మప్రియార్తా|
సీతా వితత్రాస యథా వనాంతే
సింహాభిపన్నా గజరాజకన్యా||28.01||

స|| రాక్షసేంద్రస్య తత్ అప్రియం వచః నిశమ్య అప్రియార్తా సా సీతా వనాంతే సింహాభిపన్న గజరాజకన్యా ఇవ వితత్రాస||

తిలక టీకాలో - వచో నిశమ్య సంస్మృత్య, అప్రియార్తా అప్రియేణ ప్రియసంయోగ అభావేన, ఆర్తా దుఃఖితా |

||శ్లోకార్థములు||

రాక్షసేంద్రస్య రాక్షసేంద్రుని యొక్క
తత్ అప్రియం వచః నిశమ్య - అప్రియ వచనములను వినిన
అప్రియార్తా సా సీతా - చెలికానికోసము తహతహలాడుతున్న సీత
వనాంతే సింహాభిపన్న-వన మధ్యములో సింహము ముందు వున్న
గజరాజకన్యా ఇవ వితత్రాస - గజరాజ కన్య వలె విలవిలలాడెను.్

||శ్లోకతాత్పర్యము||

"రాక్షసేంద్రుని అప్రియ వచనములను గుర్తు తెచ్చుకొన్న, చెలికానికోసము తహతహలాడుతున్న సీత, సింహము ముందు వున్న గజరాజ కన్య వలె విలవిలలాడెను." ||28.01||

ఇది త్రిజటాస్వప్నము తరువాత వచ్చిన మాట. ఆసందర్భములో 'నిశమ్య' అన్నమాట రాక్షసరాజు మాటలు వినిన అనడముకన్న , రాక్షసరాజు మాటలు గుర్తుతెచ్చుకొన్న అని అనడము సబబు.

||శ్లోకము 28.02||

సా రాక్షసీ మధ్యగతాచ భీరు
ర్వాగ్భిర్భృశం రావణ తర్జితా చ|
కాంతారమధ్యే విజనే విసృష్టా
బాలేవ కన్యా విలలాప సీతా||28.02||

స|| భీరుః భృశం వాగ్భిః రావణ తర్జితా చ రాక్షసీమధ్యగతా చ సా సీతా విజనే కాంతారమధ్యే విశృజ్య బాలా కన్యా ఇవ విలలాప||

||శ్లోకార్థములు||

భీరుః భృశం వాగ్భిః రావణ తర్జితా చ -
అలాగ భయపడిన, రావణుని మాటలచే భయపెట్టబడిన
రాక్షసీమధ్యగతా చ సా సీతా - రాక్ష స్త్రీలమధ్యనున్న ఆ సీత
విజనే కాంతారమధ్యే విశృజ్య - జనులులేని అరణ్యమధ్యంలో వదిలివేయబడిన
బాలా కన్యా ఇవ విలలాప - బాలకన్యలాగ విలపించెను

||శ్లోకతాత్పర్యము||

"అలాగ భయపడిన, రావణుని మాటలచే భయపెట్టబడిన, రాక్ష స్త్రీలమధ్యనున్న ఆ సీత జనులులేని అరణ్యమధ్యంలో వదిలివేయబడిన బాలకన్యలాగ విలపించెను." ||28.02||

రావణునితో "అసంశయం దాశరథేర్నమోక్ష్యసే",అంటే "దాశరథినుంచి తప్పించుకోలేవు" అని అన్న సీత,
"దీనోవా రాజ్యహీనోవా " అంటే "దీనుడైనా రాజ్యహీనుడైన ఆయనే నా భర్త నాగురువు " అని అన్నసీత,రాక్షసస్త్రీలచేత భయపెట్టబడి "అకాలే దుర్లభే మృత్యుః" అని,
"అల్పపుణ్యా" "కృపణా" అని తనను తాను నిందించుకున్న సీత, తన మనస్సు అదుపులో పెట్టలేకపోతుంది.

"న హి జీవితేః అర్థో" అని అనుకున్న సీత,త్రిజట స్వప్న వృత్తాంతము విని సంతోషపడినా,త్రిజట చూస్తున్న శుభసూచకములు సూచించగా వినినా,తన మనస్సును అదుపులో పెట్టలేకపోతుంది. అంటే సీత మనస్సు కుదుట పడలేదు.

సీత మనస్సులో చివరికి రావణుడు చెప్పిన మాటలే మెదలుతూ ఉంటాయి. అంతేకాదు దగ్గరలో తనవారెవరూ లేకపోవడముతో ,
అరణ్యమధ్యంలో వదిలివేయబడిన బాలకన్యలాగ విలపించెను అని అంటాడు కవి.

||శ్లోకము 28.03||

సత్యం బతేదం ప్రవదంతి లోకే
నాకాలమృత్యుర్బవతీతిసంతః|
యత్రాహమేవం పరిభర్త్స్య మానా
జీవామి కించిత్ క్షణమప్యపుణ్యా|| 3||

స|| లోకే అకాలమృత్యుః న భవతి ఇతి ఇదం సత్యం సన్తః ప్రవదంతి| యత్ర ఏవం పరిభర్త్స్యమానా అపుణ్యా అహం దీనా క్షణం అపి జీవతి బత||

||శ్లోకార్థములు||

లోకే అకాలమృత్యుః న భవతి ఇతి -
లోకములో అకాలమృత్యువు సంభవము కాదు అని
ఇదం సత్యం సన్తః ప్రవదంతి -
సంతులు చెప్పిన ఈ మాట సత్యము
యత్ర ఏవం పరిభర్త్స్యమానా అపుణ్యా -
ఎంతో భయపెట్టబడినా పుణ్యములేని
అహం దీనా క్షణం అపి జీవతి బత-
నేను ఒక క్షణము కూడా జీవిస్తున్నాను అంటే అదేకదా

||శ్లోకతాత్పర్యము||

"ఎంతో భయపెట్టబడినా పుణ్యములేని నేను ఒక క్షణము కూడా జీవిస్తున్నాను అంటే, లోకములో అకాలమృత్యువు సంభవము కాదని సంతులు చెప్పిన మాట సత్యము." ||28.03||

||శ్లోకము 28.04||

సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం
ఇదం తు నూనం హృదయంస్థిరం మే|
విశీర్యతే యన్న సహస్రధాఽద్య
వజ్రాహతం శృంగ మివాచలస్య||28.04||

స|| సుఖాత్ విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం మే హృదయం నూనం స్థిరం యత్ వజ్రాహతం అచలస్య శృంగమివ సహస్రథా అద్య నవిశీర్యతే||28.04||

||శ్లోకార్థములు||

సుఖాత్ విహీనం బహుదుఃఖపూర్ణం -
సుఖము లేక అనేక దుఃఖముల తో నిండియున్న
ఇదం మే హృదయం నూనం స్థిరం -
నా ఈ హృదయము స్థిరముగా వున్నది
యత్ వజ్రాహతం అచలస్య శృంగమివ -
వజ్రాయుధముతో కొట్టబడి పర్వత శిఖరములలా
సహస్రథా అద్య నవిశీర్యతే - వేయ్యముక్కలుగా కాకుండా

||శ్లోకతాత్పర్యము||

"సుఖము లేక అనేక దుఃఖముల తో నిండియున్న నా హృదయము, వజ్రాయుధముతో కొట్టబడి వేయ్యముక్కలుగా విరిగిన పర్వత శిఖరములలా కాకుండా, స్థిరముగా వున్నది". ||28.04||

||శ్లోకము 28.05||

నైవాస్తి దోషం మమనూన మత్ర
వధ్యాహ మస్యాఽప్రియదర్శనస్య|
భావం న చాస్యాహ మను ప్రదాతు
మలం ద్విజో మంత్రమివాఽద్విజాయ||28.05||

స|| అహం అప్రియదర్శనస్య అస్య వధ్యా అత్ర మమ దోషః న ఇవ అస్తి (యది) | అహం అస్య భావం ద్విజః అద్విజాయ మంత్రమివ అనుప్రదాతుం న అలమ్ ||28.05||

తిలక టీకాలో- అత్ర ఈదృశే విషయే ప్రాణత్యాగోఽపి నదోషం అస్తి| యతః అహమ్ అస్య వధ్యా| ఏవం చ దుర్మరణ దోషస్య దుర్వారత్వేన దోషా అభావోక్తిరితి భావః||28.05||

||శ్లోకార్థములు||

అహం అప్రియదర్శనస్య అస్య వధ్యా -
నేను దుష్టస్వరూపుడగు ఈ రావణుని చే వధింపబడెడిదానిని
అత్ర మమ దోషః న ఇవ అస్తి (యది) -
నేను చనిపోయినచో దోషములేదు.
అహం అస్య భావం -
ఆ రాక్షసుని భావమునకు
అనుప్రదాతుం న అలమ్ -
అనుగుణముగా నేను ఉండలేను
అద్విజాయ మంత్రమివ -
బ్రాహ్మణుడు ఇతరులకు మంత్రములు ఎట్లు ప్రదానము చేయడో అట్లు

||శ్లోకతాత్పర్యము||

"నేను దుష్టస్వరూపుడగు ఈ రావణుని చే వధింపబడెడిదానిని. నేను చనిపోయినచో దోషములేదు. బ్రాహ్మణుడు ఇతరులకు మంత్రములు ఎట్లు ప్రదానము చేయడో, అట్లే ఆ రాక్షసుని భావమునకు అనుగుణముగా నేను ఉండలేను. " ||28.05||

||శ్లోకము 28.06||

నూనం మమాంగా న్యచిరా దనార్య
శ్శస్త్రై శ్శితై శ్చేత్స్యతి రాక్షసేంద్రః|
తస్మిన్నాగచ్ఛతి లోకనాథే
గర్భస్థజంతోరివ శల్య కృన్తః||28.06||

స|| లోకనాథే తస్మిన్ ఆనాగచ్ఛతి అనార్యః రాక్షసేంద్రః శల్యకృంతః గర్భస్థ జంతోరివ మమ అంగాని నూనం శ్శితైః శత్రైః ఛేత్స్యతి||28.06||

రామ టీకాలో- లోకనాథే తస్మిన్ రామే అనాగచ్ఛతి సతి అనార్యః క్షుద్రో రావణః మమ అఙ్గాని గర్బస్థ జన్తోః దితిర్గర్భస్థ పవనస్య అఙ్గాని శల్యకృన్తః ఇన్ద్రః ఇవ ఛేత్స్యతి | గోవిన్దరాజ టీకాలో శల్యకృన్తః నాపితః|

||శ్లోకార్థములు||

లోకనాథే తస్మిన్ ఆనాగచ్ఛతి -
లోకనాధుడు ఇక్కడి కి రాకపోతే
అనార్యః రాక్షసేంద్రః -
దుష్టుడైన ఆ రాక్షసేంద్రుడు
శల్యకృంతః గర్భస్థ జంతోరివ -
గర్భస్థములో నున్న పిండమును ఛేదించినట్లు,
మమ అంగాని నూనం -
నా అంగములను తప్పక
శ్శితైః శత్రైః ఛేత్స్యతి -
శస్త్రములతో ముక్కలు ముక్కలుగా చేయును

||శ్లోకతాత్పర్యము||

"లోకనాధుడు ఇక్కడి కి రాకపోతే ఆ రాక్షసేంద్రుడు, గర్భస్థములో నున్న పిండమును ఛేదించినట్లు, నన్ను ముక్కలు ముక్కలుగా చేయును." ||28.06||

||శ్లోకము 28.07||

దుఃఖం బతేదం మమదుఃఖితాయా
మాసౌ చిరాయాధిగమిష్యతౌ ద్వౌ|
బద్దస్య వధ్యస్య తథా నిశాంతే
రాజాపరాధాదివ తస్కరస్య||28.07||

స|| రాజాపరాధాత్ బద్ధస్య నిశాంతే వధ్యస్య తస్కరస్య ఇవ దుఃఖితాయాః మమ ద్వౌ మాసౌ చిరాయాధిగమిష్యతః ఇదం దుఃఖం బత ||

తిలక టీకాలో- త్వత్తో వియుక్తా అత ఏవ అల్పభాగ్యాఽహమ్| విపద్యామి వినస్యామి|

గోవిన్దరాజ టీకాలో - చిరాయా దుఃఖితాయాః మమ ద్వౌ మాసౌ వధస్య అవధిభూతౌ అభిగమిష్యతః|ఇదం దుఃఖం బత| కస్య దుఃఖమ్ ఇవ? రాజాపరాధాత్ బద్ధస్య తథా నిశాన్తే వధ్యస్య తస్కరస్య ఇవ దుఃఖమ్|

||శ్లోకార్థములు||

రాజాపరాధాత్ బద్ధస్య -
రాజాపరాధము వలన బంధింపబడి
నిశాంతే వధ్యస్య తస్కరస్య ఇవ -
రాత్రిదాటిన తరువాత చంపబడు దొంగకు వలె
దుఃఖితాయాః మమ - ఈ దుఃఖములోనున్న నాకు
ద్వౌ మాసౌ చిరాయాధిగమిష్యతః -
ఈ రెండుమాసముముల గడువు కూడా చాలా కష్టము
ఇదం దుఃఖం బత - అయ్యో ఎంత కష్టము

||శ్లోకతాత్పర్యము||

"రాజాపరాధము వలన బంధింపబడి రాత్రిదాటిన తరువాత చంపబడు దొంగకు ఆ రాత్రి గడచుట కష్టము అయినట్లు, ఈ దుఃఖములోనున్న నాకు ఈ రెండుమాసముముల గడువు కూడా చాలా కష్టము." ||28.07||

||శ్లోకము 28.08||

హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే
హా రామమాతాః సహ మే జనన్యా|
ఏషా విపద్యా మ్యహ మల్పభాగ్యా
మహార్ణవే నౌరివ మూఢవాతా||28.08||

స||హారామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామమాతాః మే జనన్యా సహ అల్పభాగ్యా ఏషా అహం మహాణవే మూఢవాతా నౌరివ విపద్యామి||

||శ్లోకార్థములు||

హారామ హా లక్ష్మణ - ఓ రామా, ఓ లక్ష్మణా
హా సుమిత్రే హా రామమాతాః -
ఓ సుమిత్రాదేవి, ఓ రామమాతవైన కౌసల్యా దేవీ
మే జనన్యా సహ అల్పభాగ్యా -
ఓ జననీ భూమాతా ! అల్పభాగ్యముకల నేను,
ఏషా అహం మహార్ణవే- సముద్రము మధ్యలో
మూఢవాతా నౌరివ - సుడిగాలికి గురి అయిన ఓడ వలె
విపద్యామి - విపత్కర పరిస్థితిలో ఉన్నాను

||శ్లోకతాత్పర్యము||

"ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ సుమిత్రాదేవి, ఓ రామమాతవైన కౌసల్యా దేవీ, ఓ జననీ భూమాతా ! అల్పభాగ్యముకల నేను, సముద్రము మధ్యలో సుడిగాలికి గురి అయిన ఓడ వలె, విపత్కర పరిస్థితిలో ఉన్నాను. " ||28.08||

||శ్లోకము 28.09||

తరస్వినౌ ధారయతా మృగస్య
సత్వేన రూపం మనుజేంద్ర పుత్రౌ|
నూనం విశస్తౌ మమ కారణాత్తౌ
సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన||9||

స||మృగస్య రూపం ధారయతా సత్వేన తరస్వినౌ తౌ మనుజేంద్రపుత్రౌ వైద్యుతేన ద్వౌ సింహర్షభౌ ఇవ మమ కారణాత్ నూనమ్ విశస్తౌ||

గోవిన్దరాజ టీకాలో- మృగస్య రూపం ధారయతా సత్వేన జన్తునా మమ కారణాత్ మన్నిమిత్తమ్ విశస్తౌ హింసితౌ| ద్వౌ సింహర్షభావివ ద్వౌ సింహావివ ద్వౌ వృషభావివ ఇత్యర్థః | వైద్యుతేన అశనినా||

||శ్లోకార్థములు||

మృగస్య రూపం ధారయతా సత్వేన తరస్వినౌ -
మృగరూపములో వచ్చిన ఆ రాక్షసునిచే సాహసులైన
తౌ మనుజేంద్రపుత్రౌ - ఆ మానవేంద్రులిద్దరూ
వైద్యుతేన విశస్తౌ ద్వౌ సింహర్షభౌ ఇవ -
పిడుగుపడి నశించిన రెండు సింహములు లాగా
మమ కారణాత్ నూనమ్ విశస్తౌ- తప్పక నా కారణమువలనే (మరణించిరేమో)

||శ్లోకతాత్పర్యము||

తా|| ' మృగరూపములో వచ్చిన ఆ రాక్షసునిచే మోసగించబడి, ఆ మానవేంద్రులిద్దరూ పిడుగుపడి నశించిన రెండు సింహములు లాగా నా కారణమువలన మరణించిరేమో.

||శ్లోకము 28.10||

నూనం స కాలో మృగరూపధారీ
మా మల్పభాగ్యాం లులుభే తదానీమ్|
యత్రార్యపుత్రం విససర్జ మూఢా
రామానుజం లక్ష్మణపూర్వజం చ||28.10||

స||నూనం స కాలః మృగరూపధారీ తదానీం అల్పభాగ్యాం మూఢా మాం లులుభే యత్ర రామానుజం లక్ష్మణపూర్వజమ్ ఆర్యపుత్రం చ విససర్జ||

||శ్లోకార్థములు||

నూనం స కాలః మృగరూపధారీ -
తప్పక కాలపురుషుడే మృగరూపము ధరించి
తదానీం అల్పభాగ్యాం మూఢా మాం లులుభే -
అల్పభాగ్యముకల మూఢురాలైన నన్ను మభ్యపెట్టి
రామానుజం లక్ష్మణపూర్వజమ్ ఆర్యపుత్రం చ విససర్జ -
లక్ష్మణాగ్రజుడగు అర్యపుత్రుని, రామానుజుని కూడా కోల్పోవునట్లు చేసెను

||శ్లోకతాత్పర్యము||

"తప్పక ఆ కాలపురుషుడే మృగరూపముధరించి అల్పభాగ్యముకల నన్ను మభ్యపెట్టి లక్ష్మణాగ్రజుడగు అర్యపుత్రుని, రామానుజుని కూడా కోల్పోవునట్లు చేసెను." ||28.10||

||శ్లోకము 28.11||

హారామ సత్యవ్రత దీర్ఘబాహో
హా పూర్ణ చంద్ర ప్రతిమానవక్త్ర|
హా జీవలోకశ్చ హితః ప్రియశ్చ
వధ్యాం న మాం వేత్సి హి రాక్షసానామ్||28.11||

స||సత్యవ్రత దీర్ఘబాహో హా రామ హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్రహా జీవలోకస్య హితః ప్రియశ్చ మామ్ రక్షసానాం వధ్యాం న వేత్సి||

||శ్లోకార్థములు||

సత్యవ్రత దీర్ఘబాహో హా రామ -
సత్యవ్రతుడు దీర్ఘబాహువులు కలవాడు అయిన ఓ రామా !
హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్రహా -
పూర్ణచంద్రుని బోలి ముఖము కలవాడా
జీవలోకస్య హితః ప్రియశ్చ -
సమస్త ప్రాణులకు హితుడవు ప్రియుడవు
మామ్ రక్షసానాం వధ్యాం న వేత్సి-
రాక్షసులు నన్ను చంపుతారని తెలియదా ?

||శ్లోకతాత్పర్యము||

"సత్యవ్రతుడు దీర్ఘబాహువులు కలవాడు అయిన ఓ రామా ! పూర్ణచంద్రుని బోలి ముఖము కలవాడా సమస్త ప్రాణులకు హితుడవు ప్రియుడవు నీకు రాక్షసులు నన్ను చంపుతారని తెలియదా ? " ||28.11||

||శ్లోకము 28.12||

అనన్య దైవత్వ మియం క్షమా చ
భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే|
పతివ్రతా త్వం విఫలం మమేదం
కృతం కృతఘ్నేష్వివ మానుషాణామ్||28.12||

స||అనన్యదైవత్వం ఇయం క్షమా చ భూమౌ శయ్య ధర్మే నియమశ్చ పతివ్రతాత్వం మమ ఇదం కృతఘ్నేషు మానుషాణాం కృతమివ విఫలమ్ ||

గోవిన్దరాజులవారి టీకాలో- అనన్యదేవత్వమ్ ఆశ్రయణీయాదేవతా న అస్తి , సా రక్షిష్యతి ఇతి బుద్ధి మే నాస్తి|.. ఇయం క్షమాచ| రావణపరుషాక్షరాణి రాక్షసీనాం తర్జనభర్త్సనాదీని రామమధురాలాప శ్రవణ కుతూహలేన అహం క్షాన్తవన్తీ | భూమౌ చ శయ్యా| తవాఙ్గ్కేసముపావిశం ఇత్యేవం విధభోగః కదాచిదపి కిలసేత్ ఇతి అత్యాశయా హి మయా భూమౌ శయనం క్రియతే||నియమశ్చ ధర్మే | విఫలం మమేదమ్ అమోఘమపి మోఘమాసీత్| కస్యఏవం ఇతి చేత్ అత్ర ఆహ - కృతం కృతఘ్నేషు మానుషాణాం| ఆత్మానం మానుషం మన్యే ఇత్యుక్తరీత్యా మానుషత్వం రామస్యాపి అస్తి|అతః తదితరమానుషాణాం మధ్యే కృతఘ్నేషుకృతం కార్యమివ||అస్య కిం మూలం ఇతిచేత్ మమేదం తస్మిన్న కాచిన్నూనతా మమైవ దుష్కృతం అత్ర హేతుః||

గోవిన్దరాజులవారు తమ టీకాలో సీతమ్మ మాటలను ఇలా విశదీకరిస్తారు- ఇంకొక ఆశ్రయించతగిన దేవత నన్ను రక్షించగలదు అనే అలోచనలేదు; ఈ ఓర్పు గురించి. రావణుని పరుషమైన మాటలను రాక్షసస్త్రీల తర్జన భర్జనలు సహిస్తున్నాను; ఎందుకు? రాముని మధురమైన మాటలు వినగలను అనే ఆశతో; భూమిమీద పడుకుంటున్నాను; ఎందుకు? ఎప్పటికో ఆపటికి నీ అంగములలో సేద దీర్చుకోగలుగుతాను అనే ఆశతో ; ధర్మములు పాటిస్తున్నాను; కాని ఇవన్నీ విఫలమౌతున్నాయి. ఎందుకు ఇలాగ? అంటే ఇక్కడ చెప్పిన మాట; మానవలలో కృతఘ్నులకు చేయబడిన పనివలె అని; తనని మానవురాలిగా తలుచుకుంటున్నది అంటె రాముడు కూడా మానవుడే అనే ధ్వని కలదు ఇక్కడ. అంటే ఇతర మానవులలాగ కృతఘ్నులకు చేసినకార్యములాగ విఫలమౌతున్నాయి అని. దీనికి కారణము ఏమిటి అంటే, తన చేతనే ( సీతమ చేతనే) ఎప్పుడో చేయబడిన దుష్కర్మలవలన అని.

||శ్లోకార్థములు||

అనన్యదైవత్వం ఇయం క్షమా చ -
నీవే తప్ప ఇంకో దేముడు అని, ఎంతో ఓర్పుతో కూడా
భూమౌ శయ్య - భూమి మీద శయనిస్తూ
ధర్మే నియమశ్చ పతివ్రతాత్వం -
ధర్మములను నియమములను అలాగే పాతివ్రత్యము పాటిస్తున్నాను
కృతఘ్నేషు మానుషాణాం కృతమివ -
మానవులలో కృతఘ్నులకు చేసిన ఉపకారములవలె
ఇదం విఫలమ్ - ఇది అంతా విఫలమగుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"నీవే తప్ప ఇంకో దేముడు లేడు. ఎంతో ఓర్పుతో భూమిపై నిద్రిస్తూ, ధర్మములను నియమములను పాటిస్తూ పాతివ్రత్యము పాటిస్తున్నాను. అవి అన్నీ కృతఘ్నులకు చేసిన ఉపకారములవలే విఫలమౌతున్నాయి". ||28.12||

||శ్లోకము 28.13||

మోఘో హి ధర్మశ్చరితో మయాఽయమ్
తథైకపత్నీత్వ మిదం నిరర్థమ్|
యా త్వాం న పశ్యామి కృశా వివర్ణా
హీనా త్వయా సంగమనే నిరాశా||13||

స|| యా త్వాం నపశ్యామి త్వయా హీనా సంగమానే నిరాశా కృశా వివర్ణా మయా చరితః అయం ధర్మః మోఘః హి | తథా ఇదం ఏకపత్నీత్వాం నిరర్థమ్||

||శ్లోకార్థములు||

యా త్వాం నపశ్యామి - నిన్ను చూడలేక
త్వయా హీనా సంగమానే నిరాశా -
నీతో కలయుట అనే ఆశలేనప్పుడు
కృశా వివర్ణా మయా చరితః -
ఆశలేనప్పుడు కృశించి కళాకాంతులు నశిస్తూ నా చేత చేయబడిన
అయం ధర్మః మోఘః హి -
ఈ పాతివ్రత్యధర్మము అంతా నిరర్థకమే
తథా ఇదం ఏకపత్నీత్వాం నిరర్థమ్-
అలాగే ఈ ఏకపత్నీ వ్రతము కూడా నిరర్ధకమే|

||శ్లోకతాత్పర్యము||

"నిన్ను చూడలేక, నీతో కలయుట అనే ఆశలేనప్పుడు కృశించి కళాకాంతులు నశిస్తూ చేసిన పాతివ్రత్యధర్మము అంతా నిరర్థకమే. ". ||28.13||

||శ్లోకము 28.14||

పితుర్నిదేశమ్ నియమేన కృత్వా
వనాన్ నివృత్తశ్చరితవ్రతశ్చ|
స్త్రీభిస్తు మన్యే విపిలేక్షణాభి
స్త్వం రంస్యసే వీతభయః కృతార్థః||28.14||

స|| త్వం పితుః నిర్దేశం నియమేన కృత్వా చరితవ్రతస్య వనాత్ నివృతః వీత భయః కృతార్థః విపులేక్షణాభిః స్త్రీభిః రంస్యసే మన్యే||

||శ్లోకార్థములు||

త్వం పితుః నిర్దేశం నియమేన కృత్వా -
నువ్వు పితృవాక్యపరిపాలన నియమముగా చేసి
చరితవ్రతస్య వనాత్ నివృతః -
వనమునుంచి కృతకృత్యుడవై వెనకకి వెళ్ళి
వీత భయః కృతార్థః - భయములేనివాడవై కృతార్థుడవై
విపులేక్షణాభిః స్త్రీభిః రంస్యసే మన్యే -
అందమైన స్త్రీలతో రమించెదవని తలచెదను

||శ్లోకతాత్పర్యము||

"నువ్వు పితృవాక్యపరిపాలన నియమముగా చేసి వనమునుంచి కృతకృత్యుడవై వెనకకి వెళ్ళి భయములేనివాడవై కృతార్థుడవై అందమైన స్త్రీలతో రమించెదవని తలచెదను". ||28.14||

||శ్లోకము 28.15||

అహం తు రామా త్వయి జాత కామా
చిరం వినాశాయ నిబద్ధభావా|
మోఘం చరిత్వాఽథ తపోవ్రతం చ
త్యక్ష్యామి ధిక్ జీవిత మల్పభాగ్యా||28.15||

స|| రామా త్వయి జాతకామా అహమ్ తు చిరం నిబద్ధభావా తపః వ్రతం చ మోఘం వినాశాయ చరిత్వాథ జివితం తక్ష్యామి | అల్పభాగ్యాం ధిక్||

||శ్లోకార్థములు||

రామా త్వయి జాతకామా - ఓ రామా నీపై అనురాగముతో
అహమ్ తు చిరం నిబద్ధభావా - చిరకాలము బద్ధురాలనైనదానిని
తపః వ్రతం చ మోఘం వినాశాయ -
నా తపము వ్రతములు నిరర్థకము
చరిత్వాథ జివితం తక్ష్యామి - ఇప్పుడు నా జీవితము త్యజించెదను
అల్పభాగ్యాం ధిక్- నేను దుర్భాగ్యురాలను

||శ్లోకతాత్పర్యము||

"ఓ రామా నీపై అనురాగముతో చిరకాలము బద్ధురాలనైనదానిని. నా తపము వ్రతములు నిరర్థకము. ఇప్పుడు నా జీవితము త్యజించెదను. నేను దుర్భాగ్యురాలను."||28.15||

||శ్లోకము 28.16||

సా జీవితం క్షిప్ర మహం త్యజేయం
విషేణ శస్త్రేణ శితేన వాపి|
విషస్య దాతా న హి మేఽస్తి కశ్చిత్
శస్త్రస్య వా వేశ్మని రాక్షసస్య||28.16||

స|| అహం సా జీవితం విషేణ శితేన శస్త్రేణ వా అపి క్షిప్రం త్యజేయం | రాక్షసస్య వేశ్మని మే విషస్య శస్త్రస్య వా దాతా కశ్చిత్ నాస్తి||

||శ్లోకార్థములు||

అహం సా జీవితం - నేను ఆ జీవితమును
విషేణ శితేన శస్త్రేణ వా అపి -
విషముతో కాని వాడి ఆయుధముతో కాని
క్షిప్రం త్యజేయం - వెంటనే త్యజింపతగును.
రాక్షసస్య వేశ్మని మే - రాక్షస గృహములో నాకు
విషస్య శస్త్రస్య వా దాతా కశ్చిత్ నాస్తి -
విషము లేక శస్త్రము ఇచ్చు దాత ఎవరు లేడు

||శ్లోకతాత్పర్యము||

"అట్టి నేను విషము తాగి కాని వాడి ఆయుధముతో కాని జీవితము త్యజించవలెను. కాని ఈ రాక్షస గృహములో విషముకాని ఆయుధముకాని ఇచ్చే దాతకూడా లేడు". ||28.16||

||శ్లోకము 28.17||

ఇతీవ దేవీ బహుధా విలప్య
సర్వాత్మనా రామ మనుస్మరంతీ|
ప్రవేపమానా పరిశుష్కవక్త్రా
నగోత్తమం పుష్పిత మాస సాద||28.17||

స|| దేవీ ఇతీవ బహుధా విలప్య సర్వాత్మనా రామం అనుస్మరంతీ ప్రవేపమానా పరిషుష్కవక్త్రా పుష్పితం నగోత్తమమ్ అససాద ||

||శ్లోకార్థములు||

దేవీ ఇతీవ బహుధా విలప్య -
ఆ దేవి అలాగ అనేక విధములగా విలపిస్తూ
సర్వాత్మనా రామం అనుస్మరంతీ -
అన్నివిధములుగా రామునే స్మరిస్తూ
ప్రవేపమానా పరిషుష్కవక్త్రా -
దుఃఖముతో వణుకుతూ, నోరు ఎండిపోయి
పుష్పితం నగోత్తమమ్ అససాద -
మంచి పుష్పములు కల ఆ వృక్షసమీపమునకు వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ దేవి ఈ విధముగా విలపిస్తూ, అన్నివిధములుగా రామునే స్మరిస్తూ, దుఃఖముతో వణుకుతూ, నోరు ఎండిపోయి, మంచి పుష్పములు కల ఆ వృక్షసమీపమునకు వెళ్ళెను." ||28.17||

||శ్లోకము 28.18||

శోకాభితప్తా బహుధా విచింత్యా
సీతాఽథ వేణ్యుద్గ్రథనం గృహీత్వా|
ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రం
అహం గమిష్యామి యమస్య మూలమ్||28.18||

స||శోకాభితప్తా సీతా బహుధా విచిన్త్య అథ వేణ్యుద్‍గ్రధనం గృహీత్వా అహం వేణ్యుద్‍గ్రధనేన ఉద్‍బుధ్య శీఘ్రం యమస్య మూలం గమిష్యామి||

||శ్లోకార్థములు||

శోకాభితప్తా సీతా బహుధా విచిన్త్య -
శోకములో మునిగి పోయి ఉన్న ఆ సీత అనేక విధములుగా ఆలోచించి
అథ వేణ్యుద్‍గ్రధనం గృహీత్వా -
అప్పుడు తన జడను పట్టుకోని
అహం వేణ్యుద్‍గ్రధనేన ఉద్‍బుధ్య -
నేను ఈ జడతో గళము చుట్టుకొని
శీఘ్రం యమస్య మూలం గమిష్యామి-
శీఘ్రముగా యముని స్థానమునకు వెళ్ళెదను.

||శ్లోకతాత్పర్యము||

"శోకములో మునిగి పోయి ఉన్న ఆ సీత అనేక విధములుగా ఆలోచించి తన జడను పట్టుకోని " నేను ఈ జడతో కట్టుకొని యముని స్థానమునకు వెళ్ళెదను" అని అనుకొనెను." ||28.15||

||శ్లోకము 28.19||

ఉపస్థితా సా మృదుసర్వగాత్రీ
శాఖాం గృహీత్వాఽథ నగస్య తస్య |
తస్యాస్తు రామం ప్రవిచింతయంత్యా
రామానుజం స్వం చ కులం శుభాంగ్యాః||28.19||

స|| అథ మృదుసర్వగాత్రీ సా తస్య నగస్య శాఖాం గృహీత్వా (ఉపస్థితా)| రామం రామానుజం స్వం కులం చ ప్రవిచింతయంత్యా శుభాంగ్యాః తస్యాః తు శోకానిమిత్తాని ధైర్యార్జితాని లోకే ప్రవరాణి తథా పురాపి సిద్ధాని ఉపలక్షితాని బహూని నిమిత్తాని ప్రాదుర్భభూవుః||

||శ్లోకార్థములు||

సా తస్య నగస్య శాఖాం గృహీత్వా -
ఆ వృక్షముయొక్క శాఖలను పట్టుకొని
అథ సా మృదుసర్వగాత్రీ -
అప్పుడు మృదువైన శరీరము కల ఆ సీత
రామం రామానుజం స్వం కులం చ -
రామలక్ష్మణుల తన బంధువర్గములను
ప్రవిచింతయంత్యా ఉపస్థితా
తలచుకుంటూ నిలబడెను

సా తస్య నగస్య శాఖాం గృహీత్వా -
ఆ వృక్షముయొక్క శాఖలను పట్టుకొని
అథ సా మృదుసర్వగాత్రీ -
అప్పుడు మృదువైన శరీరము కల ఆ సీత
రామం రామానుజం స్వం కులం చ -
రామలక్ష్మణుల తన బంధువర్గములను
ప్రవిచింతయంత్యా ఉపస్థితా
తలచుకుంటూ నిలబడెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు మృదువైన శరీరము కల ఆ సీత, ఆ వృక్షముయొక్క శాఖలను పట్టుకొని, రాముని రామానుజుని తన వంశమును తలచుకొంటూ నిలబడెను." ||28.19||

||శ్లోకము 28.20||

శోకానిమిత్తాని తథా బహూని
ధైర్యార్జితాని ప్రవరాణి లోకే|
ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః
పురాపి సిద్ధా న్యుపలక్షితాని||28.20||

స|| తస్యాః శుభాంగ్యాః తు శోకానిమిత్తాని ధైర్యార్జితాని లోకే ప్రవరాణి తథా పురాపి సిద్ధాని ఉపలక్షితాని బహూని నిమిత్తాని ప్రాదుర్భభూవుః||

రామటీకాలో- రామాగమనసంభావనా నిమిత్తం యేషు తాని ధైర్యార్జితాని, ధైర్యసంపాదకాని సిద్ధాని ప్రశిద్ధాని పురా మిథిలాయాం రామాగమన సమయే ఉపలక్షితాని దృష్టాని ప్రవరాణి శ్రేష్ఠాని నిమిత్తాని శకునాః తదాకాలే శాఖావలమ్బేనోపస్థితిసమయే ప్రాదుర్బభూవుః||

||శ్లోకార్థములు||

(తస్యాః శుభాంగ్యాః తు)-
తథా శోకానిమిత్తాని ధైర్యార్జితాని -
శోకమును తొలగించు, ధైర్యమును కలిగించు
లోకే ప్రవరాణి - లోకములో ప్రసిద్ధమైనవి
పురాపి సిద్ధాని ఉపలక్షితాని - పూర్వము సత్ఫలితములను ఇచ్చినవి
బహూని నిమిత్తాని ప్రాదుర్భభూవుః-
అనేక శుభ సూచకములు కనపడెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆమెకు శోకమును తొలగించు, ధైర్యమును కలిగించు, లోకములో ప్రసిద్ధమైనవి పూర్వము సత్ఫలితములను ఇచ్చినవి అయిన శుభ సూచకములు కనపడెను".||28.20||

రామటీకాలో చెప్పబడిన మాట. అప్పుడు సీతమ్మ లాగ శింశుపా వృక్షశాఖలను పట్టుకొని రామ లక్ష్మణుల తన కులముల గురించి స్మరించినప్పుడు , ఆమెకు రాముని ఆగమన శుభ సూచకములుగా ధైర్యము కూర్చు ప్రసిద్ధమైన పూర్వము చూడబడిన, అంటే మిథిలానగరములో రాముని ఆగమనము ముందు కనపడినటువంటి శుభసూచకములు కనపడినవి అని అంటారు.

ఇక్కడ "పురాపి సిద్ధాని" అంటే పూర్వము సిద్ధించినప్పుడు కలిగిన శుభసూచనలు కనపడ్డాయి అని వస్తుంది ధ్వని. పూర్వము అంటే ఎప్పుడు? సీత కల్యాణము తరువాత జరిగిన శుభకార్యాలులేవు.
జరగవలసిన , జరగకపోయిన పట్టాభిషేకము శుభకార్యాలలో రాదు.

అంటే వాల్మీ కి చెప్పిన "పురాపి సిద్ధాని" అన్న శుభ సూచనలు, సీతారామ కల్యాణము ముందు రాముడు మిథిల వస్తున్న సందర్భములో, సీతా రామకల్యాణమును సూచిస్తూ కనపడిన
శుభసూచకములు అయివుండాలి " అని కొందరి వ్యాఖ్య.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టావింశస్సర్గః||

||om tat sat||

 

 

 

 

 

 

 

 

 

 

|| ఓమ్ తత్ సత్||